తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రతి ఏడాది భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామికి శ్రీరామనవమి రోజున కల్యాణ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ఈ ఏడాది సీఎం రేవంత్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అయితే ఈ ఆనవాయితీ ఇప్పటిది కాదు. 1890లలో ఆరో నిజాం కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతోంది.