గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలు భయపెడుతున్నాయి. ఈ గ్రామంలో మూడు నెలల వ్యవధిలో 23 మంది చనిపోవటం స్థానికులు భయపెడుతోంది. ఈ క్రమంలోనే ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తురకపాలెంలో పర్యటించారు. ఊరి ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్థులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. మరోవైపు అనుమానాస్పద పొలిమేర రాయిని కూడా అధికారులు గురువారం సరిచేశారు.