ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాలతో భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశం కోసం పోరాడుతున్న సైన్యానికి మద్దతుగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించారు. షష్ట షణ్ముక క్షేత్రాలతో పాటుగా కర్ణాటక, ఏపీలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని.. చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని జనసేన పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆదివారం అరసవెల్లి ఆలయంలో పూజలు చేయనున్నారు.