భారత్- పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల వేళ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి ఎక్కువైంది. డీప్ఫేక్, ఏఐ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొందరు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పాక్కు మద్దతుగా పోస్ట్ చేసిన విద్యార్థినిపై తాజాగా హైదరాబాద్లో కేసు నమోదైంది. తప్పుడు పోస్ట్లు చేస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా షేర్ చేయవద్దని సూచిస్తున్నారు.