భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఇప్పటికే 109 దేశాల నుంచి అందాల భామలు నగరానికి చేరుకున్నప్పటికీ.. మరికొందరు కూడా నగరానికి రావాల్సి ఉంది. అయితే విమాన సర్వీసుల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక వారికి భద్రత కల్పించటం తెలంగాణ పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. దీంతో కేంద్రం సూచనల మేరకు నడుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.