తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని మావోయిస్టుల కోసం చేపట్టిన ఆపరేషన్ కగార్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇండియా- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కర్రెగుట్ట నుంచి 5 వేల CRPF బలగాలను కేంద్రం వెనక్కి పిలిచింది. వారు ఆపరేషన్ సిందూర్లో పాల్గొననున్నారు. కాగా, గత 20 రోజుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో అనేక మంది మావోయిస్టులు, పోలీసులు చనిపోయిన సంగతి తెలిసిందే.