జగిత్యాల జిల్లా కోరుట్లలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. భార్య అలిగి పుట్టింటికి వెళ్లడంతో, ఆమెను తిరిగి ఇంటికి రప్పించేందుకు భర్త అత్తగారింటి ముందు ధర్నాకు దిగాడు. మహిళా సంఘాలు సైతం ఆ భర్తకు మద్దతు తెలిపాయి. అయితే, ఆ భార్య మాత్రం భర్తతో వెళ్లేందుకు ససేమిరా అంటోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.