తెలంగాణ ప్రభుత్వం భూముల వ్యవహారాల కోసం ధరణి స్థానంలో 'భూ భారతి' పేరుతో కొత్త పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. అయితే.. ఈ పోర్టల్ మీద చాలా మందికి చాలా సందేహాలు వస్తున్నాయి. అవి ఎవరిని అడగాలో తెలియక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం.. టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా.. భూమి సమస్యల పరిష్కారంతో పాటు, చాలా సందేహాలను సులభంగా నివృత్తి చేసుకోవచ్చు.