తెలంగాణలో భూముల క్రయవిక్రయాలు 'భూభారతి' ద్వారా వేగంగా జరుగుతున్నా.. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో జాప్యం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రిజిస్ట్రేషన్లు పూర్తయి నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వ పథకాలకు కీలకమైన పాసుపుస్తకాలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ, తపాలా శాఖల మధ్య బకాయిలు, ప్రింటింగ్ జాప్యం దీనికి కారణాలుగా తెలుస్తున్నాయి.