కేంద్ర మంత్రి బండి సంజయ్ తిరుమల పర్యటనలో టీటీడీలో అన్యమత ఉద్యోగుల గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీటీడీలో వెయ్యి మంది అన్యమత ఉద్యోగులున్నారని, వారిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బండి సంజయ్ ఆరోపణలకు ఆధారాలు చూపాలని ఆయన సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.