Bhogapuram Airport First Test On January 4 2026: విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జనవరి 4, 2026న తొలి విమానం ఎగరనుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, ఎంపీ అప్పలనాయుడు ఢిల్లీ నుంచి ఈ తొలి విమానంలో భోగాపురం ఎయిర్పోర్ట్కు రానున్నారు. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి, అంతర్జాతీయ విమాన సేవలకు కీలక కేంద్రంగా మారనుంది.