ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో సువర్ణాధ్యాయం మొదలు కానుంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్ట్ ఒకటో తేదీన భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ వేడుక చరిత్రలో నిలిచిపోయేలా చూడాలని అధికారులను ఆదేశించారు.