ఏపీలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వచ్చే ఐదురోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని శనివారం రోజున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం పలు జిల్లాలలో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.