మంగళగిరివాసులకు మంత్రి నారా లోకేష్ శుభవార్త వినిపించారు. ఆగస్టు నెలలో 2000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. బుధవారం మంగళగిరిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నారా లోకేష్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగానే ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే టిడ్కో ఇళ్ల కోసం స్థల సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.