మంగళగిరి: చేనేత కార్మికులకు శుభవార్త.. మజూరీ పెంపు..

9 months ago 23
మంగళగిరిలోని చేనేత కార్మికులకు శుభవార్త. చేనేత కార్మికుల మజూరీని పెంచారు. మంగళగిరి చేనేత కార్మికుల మజూరీ 12 శాతం పెంచారు. మజూరీ పెంపు కోసం గత కొంతకాలంలో మంగళగిరిలోని చేనేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని.. మార్కెట్లో అన్నింటి ధరలు పెరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో జీవనం కష్టంగా మారుతోందన్నారు. మజూరీ సరిపోవటం లేదని.. 40 శాతం పెంచాలని ఇటీవల ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే చేనేత కార్మికుల మజూరీ 12 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article