Mangalagiri House Pattas: ఏపీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో నివసిస్తున్న పేదలకు తీపికబురు చెప్పారు. ఈ నెల 4న ప్రారంభమై 12 వరకు కార్యక్రమం నిర్వహిస్తారు. మొదటి విడతలో 3000 మంది లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఎన్నికలకు ముందు మంగళగిరిలో చాలా కాలంగా ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకుని స్థానికులు నివాసం ఉంటున్నవారికి లోకేష్ హామీ ఇచ్చారు. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ఆ హామీని నెరవేర్చడానికి సిద్ధమయ్యారు.