తెలంగాణలో భిన్నమైన వాతావరణం నెలకొంది. పగలు ఎండలు దంచికొడుతుండగా.. సాయంత్రం వర్షాలతో ప్రజలకు ఉపశమనం కలుగుతోంది. బంగాళాఖాతంలోని ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు, రాష్ట్రానికి వడగాలుల ముప్పు ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో 13 జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది.