టీటీడీలో అన్యమత ఉద్యోగులున్నారన్న ఆరోపణలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ధృవీకరించారు. గతంలో హిందువులు కాని వారిని నియమించారని, వారిని బదిలీ చేసేందుకు నివేదిక కోరినట్లు తెలిపారు. దేవదాయ శాఖకు టీటీడీ నుంచి రావాల్సిన నిధులపై ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. నిరుద్యోగ వేదపండితులకు ఆర్థిక సహాయం, కనకదుర్గమ్మ ఆలయానికి భూమి లీజు వంటి అంశాలపై చర్చించారు. ఆగస్టులో దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు పాలకవర్గాలను నియమిస్తామని మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలు మీకోసం