తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కీలక ప్రకటన చేశారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) నిర్మాణం మరో రెండేళ్లలో పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సొరంగం పనుల్లో రక్షణ శాఖ సహాయం కోరినట్లు తెలిపారు. ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, జనరల్ హర్పాల్ సింగ్లను రాష్ట్రానికి పంపేందుకు కేంద్రం అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. జులై 12 నుంచి ఎస్ఎల్బీసీ పనులకు సంబంధించిన సర్వే ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు.