దేవుడి భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. కబ్జాదారులపై పీడీ యాక్ట్ కింద శిక్షలు తప్పవని ఆమె అన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా మేడ్చల్ వద్ద దేవాదాయ భూములను పరిశీలించి, కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలానే బోడుప్పల్ పరిధిలో 30 ఎకరాల దేవాదాయ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. దేవాలయాల భూముల సంరక్షణకు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తుందని ఆమె పేర్కొన్నారు.