యాసంగి రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఐదు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ కాగా, అర్హత ఉండి డబ్బులు పడని రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని మంత్రి తుమ్మల సూచించారు. జూన్ 5 వరకు భూమి హక్కులు పొందిన రైతులు జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 6404.7 కోట్లు జమ అయ్యాయి.