ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. దీనిలో భాగంగా క్రీడాకారులకు 3 శాతం కోటా అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. విశాఖపట్నంలో జరిగిన బ్రేకింగ్ బౌండరీస్ కార్యక్రమంలో నారా లోకేష్ మాట్లాడుతూ,.. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు క్రీడారంగానికి చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..