ఏపీ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటైంది. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా శాఖమూరులో ఏర్పాటుచేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి యాంకర్ సుమ ఇచ్చిన ఎలివేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.