తెలంగాణలో మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రాజుకుంది. కాంగ్రెస్ పెద్దలు బుజ్జగింపు చర్యలు చేపట్టినా వారిలో అసంతృప్త జ్వాల చల్లరాటం లేదు. తాజాగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కేబినెట్ విస్తరణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న వారికి కాకుండా.. కొత్తగా చేరిన వారికి పదవులు ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను మంత్రి పదవి కోరినా పార్టీ హైకమాండ్ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.