టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్యపై మంత్రి టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టే పోలీసు నిఘా వ్యవస్థ ఈ విషయంలో ఏమైందంటూ ప్రశ్నించారు. ఇంతియాజ్ మరణానికి ముందే రిప్ అంటూ పోస్టు పెడితే కనీసం ఎందుకు పట్టించుకోలేదని అడిగారు. వైసీపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కర్నూలు ఎస్పీ జిల్లాలో జరుగుతున్న పరిణామాలను సీరియస్గా తీసుకుని, నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆయన కోరారు.