తెలంగాణలో గణేష్ నిమజ్జనాలకు ఏర్పా్ట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆయా జిల్లాలోని స్థానిక చెరువులు, యేరు, వాగుల్లో నిమజ్జనం చేసేందుకు అధికారులు అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని సెప్టెంబర్ 6వ తేదీన ఖైరతాబాద్ నిమజ్జనం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజు ఉదయం 6 గంటల నుంచి మద్య దుకాణాలు బంద్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో రేపటి నుంచే మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.