తెలంగాణలో బోనాల సందడి మొదలైన వేళ మందుబాబులకు షాక్ తగిలింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. జూలై 13 ఉదయం 6 గంటల నుంచి 15 ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. భక్తుల భవిష్యవాణి, లక్షలాదిగా తరలివచ్చే ప్రజల దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.