హైదరాబాద్లో కల్తీ కల్లు కలకలం రేపింది. కూకట్పల్లిలో పది మంది మృతి చెందడంతో రేవంత్ సర్కార్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కల్తీ కల్లు దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 454 కల్లు దుకాణాలను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కల్తీ కల్లు నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ వివరాలు..