Bapatla Church Case Ramireddy Comments On Supreme Court Verdict: కొంతమంది ప్రోద్బలంతో తన స్థలం ఆక్రమించి చర్చి నిర్మాణం చేసి ప్రశ్నించినందుకు కేసులు పెట్టారని బాపట్లకు చెందిన రామిరెడ్డి అంటున్నారు. చర్చి విషయంలో ప్రశ్నించడంతోనే తమపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన వేళ చర్చి స్థలం యజమాని రామిరెడ్డి స్పందించారు. తాను ఐదేళ్లు న్యాయ పోరంగా చేస్తే సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పటికి న్యాయం దక్కిందన్నారు. 2021 నాటి చర్చి కేసుపై కీలక విషయాలు వెల్లడించారు.