మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్ద పీఏగా పనిచేసిన ముని తుకారాం, పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రగిరి మండలం పనపాకం టోల్ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తిరుపతి సీఐడీ ఆఫీసుకు తరలించారు. ఈ కేసులో మాధవరెడ్డి ఏ3, ముని తుకారాం ఏ4గా ఉన్నారు.