తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. లిక్కర్ షాపు వద్ద సిట్టింగ్ రూమ్ లేకపోవడంతో నడిరోడ్డుపైనే బాటిల్ పట్టుకుని నిరసన తెలిపాడు. సిట్టింగ్ రూములు ఏర్పాటు చేయకపోతే మళ్ళీ వచ్చి ఇక్కడే తాగుతానని హెచ్చరించాడు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం పర్మిట్ రూములు రద్దు చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. త్వరలో పర్మిట్ రూములకు అనుమతిచ్చే ఆలోచనలో ఏపీ ఎక్సైజ్ శాఖ ఉంది.