మధు యాష్కీ గౌడ్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు..

9 months ago 19
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని సచివాలయానికి మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యేందుకు వెళ్లిన ఆయన అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర చికిత్స నిమిత్తం ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read Entire Article