హైదరాబాద్లోని మధురానగర్లో పవన్ కుమార్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తొలుత గుండెపోటుగా భావించినప్పటికీ, అతని మర్మాంగాల వద్ద పెంపుడు కుక్క కరిచిన ఆనవాళ్లు కనిపించాయి. కుక్క నోటికి రక్తపు మరకలు ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఇది గుండెపోటుతో మరణమా..? కుక్క కరవడం వల్ల ఈ మరణం జరిగిందా అనే అసలు నిజం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.