మన్యం జిల్లా: అంబులెన్స్ లేక చెత్త రిక్షాలో మహిళ మృతదేహం తరలింపు.. అసలు ఏం జరిగిందంటే?

5 months ago 18
Manyam Woman Dead body Carried garbage rickshaw: పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ మహిళ మృతదేహాన్ని చెత్తను సేకరించే రిక్షాలో తరలించారంటూ సోషల్ మీడియాలో వీడియోలు, వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చనిపోయిన రాధమ్మ అనే మహిళ మృతదేహాన్ని అంబులెన్స్ లేకపోవటంతో చెత్త రిక్షాలో ఇంటికి తీసుకెళ్లారంటూ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. ఆస్పత్రి యాజమాన్యం అంబులెన్స్ ఏర్పాటు చేయలేదని.. ప్రైవేట్ అంబులెన్స్‌లకు డబ్బులు చెల్లించలేక రాధమ్మ కుటుంబం.. ఆమె మృతదేహాన్ని మూడు చక్రాల వాహనంలో తరలించిందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం క్లారిటీ ఇచ్చింది.
Read Entire Article