తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు అమెరికా నుంచే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి ఇంఛార్జ్ మంత్రులకు కీలక ఆదేశాలిచ్చారు. 90 శాతం స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టారు. రెబల్స్ బెడద లేకుండా చూసుకోవాలని, టికెట్లు రాని వారికి భవిష్యత్తులో గుర్తింపు ఇస్తామని హామీ ఇవ్వాలని సూచించారు.