తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇక మరింత కష్టతరం కానుంది. కొత్తగా ట్రాక్తో పాటు సిమ్యులేటర్పై డ్రైవింగ్ నైపుణ్యాలను శాస్త్రీయంగా పరీక్షించనున్నారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రవాణాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో 18 ఆర్టీవో కార్యాలయాల్లో ఈ విధానం అమల్లోకి రానుంది. సిమ్యులేటర్ పరీక్షలో డ్రైవింగ్ చేసేవారి స్పందనలను కూడా కెమెరాల ద్వారా పరిశీలిస్తారు.