తెలుగు రాష్ట్రాలకు 'సెన్యార్' తుపాను ముప్పు తప్పింది. అయితే, శ్రీలంక సమీపంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి, శనివారం నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.