తెలంగాణలో గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పరిపాలన అధికారి(జీపీఓ)ని నియమించనుంది. మొదటి విడతగా 3,454 మంది వీఆర్ఓ, వీఆర్ఏలకు జీపీఓలుగా అవకాశం కల్పిస్తూ నియామక పత్రాలు అందజేయనున్నారు. అర్హత పరీక్షకు మరో అవకాశం కల్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 61 ఏళ్లు దాటిన వీఆర్ఏల వారసులకు అవకాశం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.