హైదరాబాద్ సిటీలో గురువారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. కేవలం గంట వ్యవధిలోనే కుంభవృష్టితో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమీర్పేట, యూసఫ్గూడ ప్రాంతాల్లో వరద నీరు భుజాల వరకు చేరిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో రెండు ఇదే పరిస్థితి అని తెలిపిన వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సహాయక చర్యల కోసం జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి, కంట్రోల్ రూమ్ నెంబర్లను అందుబాటులో ఉంచాయి. ఆ వివరాలు..