మరో రెండో రోజులు కుంభవృష్టి.. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్

7 months ago 10
తెలంగాణలో గురు సాయంత్రం కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో కుండపోత వానలు కురిసి, రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. సహాయం కోసం కంట్రోల్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Read Entire Article