మూడు రోజుల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం 23 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. తాజాగా, 12 జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. పార్వతీపురం మన్యం, ప్రకాశం, తూర్పు గోదావరి సహా 12 జిల్లాలకు కొత్తవారిని నియమించింది. సెప్టెంబరు 8న జరిగిన బదిలీల్లో టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును జీఏడీకి పంపి... ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ను నియమించింది. ఇక, రాష్ట్రంలో ఐఏఎష్ల బదిలీల అంశాన్ని స్వయంగా సీఎం చూస్తున్నారు.