ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కవిత నివాసానికి సీబీఐ అధికారులు చేరుకుని హైకోర్టు నోటీసులు అందజేశారు. కింది కోర్టు ఇచ్చిన క్లీన్చిట్ను సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన అప్పీల్పై కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. గతంలో 164 రోజుల పాటు తిహార్ జైలులో ఉన్న కవిత.. ఇటీవలే విముక్తి పొందారు. తాజాగా సీబీఐ ఈ కేసులో విచారణను వేగవంతం చేయడంతో రాజకీయ వర్గాల్లో మళ్ళీ ఉత్కంఠ నెలకొంది.