మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్.. ఏపీ ప్రభుత్వానికి విరాళం..

2 months ago 6
Sonu Sood meets Chandrababu: సినీ నటుడు సోనూసూద్ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. తన ఛారిటీ తరుఫున ఏపీ ప్రభుత్వానికి అంబులెన్సులు విరాళంగా అందించారు. సోమవారం ఏపీ సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడును సోనూసూద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సూద్ చారిటీ ఫౌండేషన్ తరుఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను సోనూసూద్ విరాళంగా అందించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోనూసూద్‌ను అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్న చంద్రబాబు.. తమ ఆశయంలో ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Read Entire Article