Water Board MD on Malakpet Sewage Issue: మలక్పేటలో మూడు రోజులుగా డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజాం కాలం నాటి సీవరేజ్ లైన్ శిథిలం కావడంతో ఈ సమస్య తలెత్తిందని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని, వర్షపు నీరు, మురుగు నీరు వేరు చేసేందుకు కొత్త లైన్లు నిర్మించాలని తెలిపారు. అలానే మ్యాన్ హెల్లో వ్యర్థాలు వేసిన హోటల్ యజమానికి రూ.10 వేలు జరిమానా విధించారు.