నగరంలో డ్రగ్స్ రవాణా అరికట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే, కొందరు పోలీసు అధికారుల పిల్లలే డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. మల్నాడు డ్రగ్స్ కేసులో ఇద్దరు సీనియర్ పోలీసు అధికారుల కుమారులు రాహుల్ తేజ, మోహన్ అరెస్ట్ అయ్యారు. వీరికి మల్నాడు కిచెన్ యజమాని సూర్యతో సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఈ వ్యవహారం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ఈ డ్రగ్స్ దందా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో చూడాలి.