కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల కోసం 100 గదుల సత్రం నిర్మాణం చేపట్టనున్నారు. ఆలయ నిధులు.. దాతల సహకారంతో రూ. 17 కోట్ల అంచనా వ్యయంతో ఈ సత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే 50 గదుల ధర్మశాల నిర్మాణంలో ఉండగా.. కొత్త సత్రంతో భక్తుల వసతి కష్టాలు తీరనున్నాయి. మొదటి దశలో 20 కాటేజీలు నిర్మించి, మిగిలినవి దాతల సహకారంతో పూర్తి చేయాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.