సాధారణంగా దేవదాయ శాఖ పరిధిలో ఉండే గుళ్లల్లో.. హుండీల లెక్కింపు ప్రక్రియ ఆలయ అధికారులు, లేదా ఈవో పర్యవేక్షణలో జరుగుతుంది. కానీ కడప జిల్లా గోపవరం మండలంలోని మల్లెంకొండ ఆలయంలో మాత్రం కొంతమంది హుండీని తెరిచి డబ్బులు పంచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా హుండీలలో భక్తులు కానుకలు సమర్పించారు. అయితే హుండీ లెక్కింపును ఈవో లేకుండానే చేపట్టారని.. కొంతమంది హుండీ తెరిచి, డబ్బులు పంచేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.