తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీర్పు వెలువరించినా.. ఈ వ్యవహారం మళ్లీ హైకోర్టుకు ఎక్కింది. స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ.. పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్లను స్వీకరించిన తెలంగాణ హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని.. తాజాగా ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఇక ఇప్పటికే ఇదే వ్యవహారంలో దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు ఇవ్వడం గమనార్హం.