మహా శివరాత్రి వేడుకలకు శ్రీశైలం పుణ్యక్షేత్రం సిద్ధమైంది. రేపటి నుంచి (ఫిబ్రవరి 19) శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీ టూరిజం శుభవార్త వినిపించింది. విజయవాడ నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. రాజమండ్రి నుంచి ఈ బస్సులు బయల్దేరనున్నాయి.