మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం ఉండే భక్తులకు మంత్రి కొండా సురేఖ గుడ్న్యూస్ చెప్పారు. ప్రముఖ ఆలయాల్లో ఉపవాసం ఉండే భక్తులకు పండ్లు, అల్పాహారం ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ఆలయాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.